బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (13:32 IST)

ఆప్ఘన్ మార్కెట్ వద్ద బాంబ్ బ్లాస్ట్: ఐదుగురు మృతి

ఆప్ఘనిస్థాన్ మార్కెట్‌లో బాంబు పేలిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘానిస్థాన్ టక్కర్ ప్రావెన్స్లోని ఖ్వాజాగఢ్ జిల్లా స్థానిక మార్కెట్ వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించగా,  మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తద్వారా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరు ప్రకటించ లేదన్నారు. అయితే ఇది తాలిబాన్ తీవ్రవాదుల పనే అని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో ఆఫ్ఘానిస్థాన్లో జరిగిన హింస కారణంగా 1560 మంది మృత్యువాత పడగా, 3290 మంది గాయపడ్డారని కాబూల్లోని యూఎన్ మిషన్ వెల్లడించింది.