అత్యాచార దోషులకు 140 ఏళ్ల జైలు : 12 మందిలో పాక్, బంగ్లాదేశీయులు కూడా..?
మూడేళ్ల క్రితం బ్రిటన్కు చెందిన ఒక బాలికపై అత్యాచారం కేసులో దోషులకు సెన్సేషనల్ తీర్పునిచ్చింది. అత్యాచార దోషులకు 140 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ కోర్టు తీర్పు నిచ్చింది. దోషులలో 12 మంది పాకిస్థానీయులతో పాటు బంగ్లాదేశ్కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు.
వివరాల కెళితే.. 2011-12 మధ్య కాలంలో వెస్ట్ యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన బాలికను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి సుమారు 13 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అహ్మద్ అల్ చౌదరి రింగ్ ప్రధాన ముద్దాయి అని ప్రాసిక్యూటర్ చెప్పారు. అత్యాచారానికి గురైన బాధితులు పలు మనో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు.