శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (13:12 IST)

గాజాలో ఆగని మారణ కాండ: 100 పాలస్తీనియన్ల హతం!

గాజాలో హింస ఆగట్లేదు. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో బుధవారం దాదాపు 100 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ఓ స్కూలులో తలదాచుకున్న 20 మంది కూడా ఉన్నారు. అయితే తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి వీలుగా నాలుగు గంటలపాటు తాత్కాలికంగా దాడులకు విరామం ప్రకటించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. 
 
మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ గాజాపై భారీఎత్తున గగనతల దాడులతో పాటుగా భూతల, సముద్ర దాడులను కొనసాగించడంతో కనీసం 68మంది పాలస్తీనియన్లు చనిపోగా, మరో 110మంది గాయపడినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఈనెల 8న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు ప్రారంభమైనప్పటి నుంచి గత 23 రోజుల్లో గాజాలో మొత్తం 1283మంది చనిపోగా, 7100 మందికి పైగా గాయపడ్డారు.