శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: బుధవారం, 28 జనవరి 2015 (07:48 IST)

ట్రిపోలీలో ముంబయి 26/11 తరహా దాడులు.. బంధీలుగా పర్యాటకులు

లిబియా రాజధాని ట్రిపోలీలో ఉగ్రవాదులు మరో అలజడి సృష్టించారు. ఓ హోటల్ లో 26/11 తరహా దాడికి పాల్పడ్డారు. పర్యాటకులను బంధీలుగా పట్టుకున్నారు. బాంబులు పేల్చి అలజడి సృష్టించారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు పర్యాటలను విడిపించేందుకు కష్టపడుతున్నాయి. 
 
విదేశీయులు ఎక్కువగా విడిది చేసే కొరింతియా లగ్జరీ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. హోటల్ కు కాపాలా ఉన్న ముగ్గురు గార్డులను కాల్చిచంపారు. పలువురు పర్యాటకులను బందీలుగా పట్టుకున్నారు. ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు కాల్పులు జరుపుతూ హోటల్ లోకి ప్రవేశించినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. కారు పార్కింగ్ ప్రదేశంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారని కూడా వెల్లడించారు. ఉగ్రవాదుల బారి నుంచి బందీల విడిపించేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.