గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (11:28 IST)

కాశ్మీర్‌లో క్షతగాత్రులకు వైద్యం చేస్తాం.. వీసాలు ఇవ్వండి : హఫీజ్

కాశ్మీర్ అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 26/11 దాడుల సూత్రధారి, పాక్‌లోని జమాత-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్ కోరుతున్నాడు.

కాశ్మీర్ అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 26/11 దాడుల సూత్రధారి, పాక్‌లోని జమాత-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌  సయీద్ కోరుతున్నాడు. 
 
కాశ్మీర్‌ లోయలో అనంతనాగ్‌ జిల్లా దాకా ప్రదర్శనకు వేర్పాటువాదుల పిలుపు నేపథ్యంలో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు సోమవారం కూడా కొనసాగాయి. హురియత్ నేత గిలానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... పాక్‌లోని జమాత్-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌ నేతృత్వంలోని ముస్లిం మెడికల్‌ మిషన్‌ (ఎంఎంఎం) బయల్దేరింది. ఇందుకోసం 30 మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి వీసా ఇవ్వాలని హఫీజ్‌ బృందం మంగళవారం భారతకు దరఖాస్తు చేయనుంది. 
 
వీసా మంజూరు చేయకపోతే జేయూడీ సహా 40 మతపార్టీలతో కూడిన దెఫా-ఎ-పాకిస్థాన్‌ కౌన్సిల్‌ (డీపీసీ) ఈ నెల 31న లాహోర్‌ నుంచి వాఘా సరిహద్దుదాకా నిరసన యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.