జపాన్తో పరిశోధనా రంగంలో కలిసి పనిచేస్తాం: మోడీ
జపాన్తో కలిసి పరిశోధనా రంగంలో పనిచేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. గుజరాత్ సీఎంగా జపాన్ పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్నారు.
ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసరమని మోడీ వెల్లడించారు. పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. సుపరిపాలన తమ ప్రభుత్వ ధ్యేయమని మోడీ పేర్కొన్నారు.
విశ్వమానవ కల్యాణానికి జపాన్ అందించిన సాయం ఎనలేనిదని మోదీ కొనియాడారు. జపాన్ పారిశ్రామికవత్తేలతో సమన్వయం కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయనున్నట్లు మోడీ అన్నారు.