శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (14:34 IST)

థర్మామీటర్ పగిలిపోయింది.. క‌నురెప్ప‌పై పడిన నీటి తుంప‌ర గడ్డ‌క‌ట్టింది

కను రెప్పల మీద పడే నీటి తుంపర కూడా గట్టికట్టిపోయేంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఫలితంగా ఈ తరహా ఉష్

కను రెప్పల మీద పడే నీటి తుంపర కూడా గట్టికట్టిపోయేంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఫలితంగా ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ప్ర‌పంచంలో అత్యంత చ‌లిగా ఉండే సైబీరియాలోని ఓమ్యాకోన్‌ గ్రామంలో -62 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. దీంతో అక్క‌డ ఏర్పాటు చేసిన థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోయింది. ఈ వారంలో చ‌లి తీవ్ర‌త పెర‌గ‌డంతో థ‌ర్మామీట‌ర్‌లో ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ అధికారులు వెల్లడించారు. అంటార్కిటికాకాకుండా ఇత‌ర జ‌నజీవ‌న ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త -67.7 డిగ్రీల సెల్సియ‌స్‌ కావడం గమనార్హం. 
 
ఉష్ణోగ్ర‌త‌లు ఇలాగే ప‌డిపోతే ఆ రికార్డును దాటే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌పడుతున్నారు. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌కి క‌నురెప్ప‌ల మీద ఉండే నీటి తుంప‌ర కూడా మంచులా మారిపోతోంది. అక్క‌డి య‌కుస్కు గ్రామంలో నివ‌సించే అన‌స్టేషియా అనే యువ‌తి తీసుకున్న సెల్ఫీ చూస్తే అక్క‌డి చ‌లి తీవ్ర‌త అర్థ‌మ‌వుతోంది.