శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (07:12 IST)

కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు: రాజ్ నాథ్ సింగ్

కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తూనే ఉందని, ఇందులో భాగంగా దీపావళి పర్వదినాన కూడా తన దుశ్చర్యలకు పాక్ విరామం ఇవ్వలేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 
 
తాము శాంతిని కోరుకుంటున్నా, పాక్ మాత్రం తీరు మార్చుకోవడం లేదని రాజ్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేమెప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఎప్పుడు కాల్పులకు దిగినా, పాక్ కాల్పులకు ప్రతిచర్యగానే స్పందించాం. ఇప్పటికైనా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు స్వస్తి చెప్పాల్సి ఉంది’ అని రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.