శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:59 IST)

భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్.. మంచు కురిసేలోపే ప్రతీకారం

భారత్‌పై పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోందట. అదీ కూడా జమ్మూకాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయానికే ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక

భారత్‌పై పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోందట. అదీ కూడా జమ్మూకాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయానికే ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతాండాలపై భారత ఆర్మీ మెరుపుదాడి జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెల్సిందే. 
 
ఈ సర్జికల్ దాడులపై పాకిస్థాన్ రగిలిపోతోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో, మంచు కురిసే లోపల భారత భూగాగంలోకి ఉగ్రవాదులను పంపి, మారణహోమం సృష్టించేందుకు చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు నిత్యం కాల్పులకు తెగబడుతున్నారు. 
 
ఈ కాల్పులు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు... గత నాలుగు రోజులుగా పాక్‌కు చెందిన ఎస్ఎస్‌జీ కమెండో ప్లటూన్లు సరిహద్దుల్లో మోహరిస్తున్నాయి. 14 నుంచి 15 ప్లటూన్లను ఓ కల్నల్ ర్యాంక్ అధికారి పర్యవేక్షిస్తున్నారని ఇంటలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. మరోవైపు, పాక్ కాల్పులను భారత భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.