ఎబోలా వైరస్ సోకిన భారతీయుడు మృతి
ఎబోలా వైరస్ సోకిన భారతీయుడు మహ్మద్ అమీర్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న అమీర్ ఈ నెల 10వ తేదీన భారత్కు వచ్చాడు.
ఢిల్లీ విమానాశ్రయంలో అతనికి ఎబోలా పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు లైబీరియాలో నిర్వహించిన రక్త పరీక్షల్లో అతనికి ఎబోలా లేదని తేలింది.
అయితే వీర్యం నమూనాల పరీక్షల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో భారత అధికారులు అతన్నివిమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాటుతో విడిగా ఉంచి చికిత్స అందించారు.
ఈ స్థితిలో అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా దేశంలో ఇదే తొలి ఎబోలా కేసుగా భావిస్తున్నారు.