శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (18:36 IST)

మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం.. 13ఏళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు

12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ షాపింగ్ మాల్‌లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి ఆ చిన్నారితో పరిచయం ఏర్పరుచుకున్న ఆ కామాంధుడు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సింగపూర్ మినిమార్ట్ అనే షాపింగ్ మాల్‌లో పనిచేసే ఉదయ్ కుమార్ అనే 31ఏళ్ల వ్యక్తి.. షాపింగ్ మాల్‌కు వచ్చే చిన్నారితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ చిన్నారితో రోజూ గడిపేవాడు. గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
కానీ ఉదయ్ కుమార్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ వుండేది. ఆమెను గత మూడు నెలలుగా పట్టించుకోకపోవడంతో.. ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో అతడి మొబైల్ ఫోన్‌ను చెక్ చేసింది. అంతే అందులో 12 ఏళ్ల మైనర్ నగ్న చిత్రాలు వుండటం, వాళ్లిద్దరూ సన్నిహితంగా వున్న ఫోటోలు వుండటంతో షాక్ అయ్యింది. దీంతో మైనర్ బాలికతో శారీరక సంబంధాన్ని కలిగి వుండిన బాయ్‌ఫ్రెండ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. విచారణలో అతడు దోషిగా తేలడంతో.. 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాకుండా తాను చేసిన తప్పు విలువ తెలిసేలా 12 కొరడా దెబ్బలు కొట్టాలని కూడా తీర్పు వెలువరించింది.