శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (13:39 IST)

లైంగిక వాంఛను తీర్చలేదని కాల్చేశారు...!

సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు  విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. 
 
ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన 91 మంది పురుషులతో సహా మొత్తం 241 మందిని తీవ్రవాదులు అతి కిరాతికంగా కాల్చి చంపారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం.  
 
ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. 
 
ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్‌ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు.