ఇష్రత్ జహాన్ లష్కరే సభ్యురాలే.. సూసైడ్ బాంబర్ కూడా: డేవిడ్ హెడ్లీ
గుజరాత్ రాష్ట్రంలో 2004లో ఎన్కౌంటర్కు గురైన ఇష్రత్ జహాన్ లష్కరే సభ్యురాలేనని ముంబై దాడుల్లో అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న యూఎస్ - పాక్ పౌరుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై దాడుల కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణను ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ మరికొన్ని ముఖ్యమైన విషయాలను గురువారం నాటి విచారణలో చెప్పాడు.
ఇష్రత్ జహాన్ సూసైడ్ బాంబర్గా శిక్షణ పొందిందని హెడ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల కేసులో హెడ్లీ విచారణ కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెడ్లీని ముంబై కోర్టు విచారిస్తుంది. ఉగ్రదాడికి ముందు ముంబైకి తహవూర్ రాణా వచ్చాడని హెడ్లీ వివరించాడు.
అలాగే, సెప్టెంబర్ 2006లో పాక్ సైన్యాధికారి మేజర్ ఇక్బాల్ తనకు 25 వేల డాలర్లు ఇచ్చి పంపాడని, ఆ మొత్తాన్ని ముంబై నారిమన్ బ్రాంచ్లోని ఇండస్ఇండ్ బ్యాంకు శాఖ నుంచి డ్రా చేసుకున్నట్టు చెప్పాడు. భారత్లో వ్యాపార ఖాతా తెరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పాడు. ముంబైపై ఉగ్రదాడికి ముందు తహవూర్ రాణా వచ్చాడని, తుది రెక్కీ ఆయనే నిర్వహించాడని హెడ్లీ కోర్టుకు తెలిపాడు.