మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (09:28 IST)

పెచ్చరిల్లిపోతున్న ఐసిస్ ఆగడాలు.. మెడపై కెమెరాపెట్టి పేల్చేశారు.. పదునైన కత్తితో..!?

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమ చేతికి చిక్కిన వారిని చిక్కినట్టుగా అత్యంత కిరాతంగా హతమారుస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా తాము సాగించిన మారణకాండ వీడియోలను సామాజిక మాద్యమాల్ల

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమ చేతికి చిక్కిన వారిని చిక్కినట్టుగా అత్యంత కిరాతంగా హతమారుస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా తాము సాగించిన మారణకాండ వీడియోలను సామాజిక మాద్యమాల్లో పెట్టి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలు భీతి గొల్పుతున్నాయి.
 
తమకు చిక్కిన జర్నలిస్టులను ఐసిస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హతమార్చారు. జర్నలిస్టుల చేతులను బేడీలతో ఇనుప రెయిలింగ్‌కు కట్టేసి, మెడకు ఇనుప గొలుసును బిగించి వారిని ఖైదీలుగా బంధించారు. అనంతరం జర్నలిస్టుల కెమెరాలు, ల్యాప్ టాప్‌ల్లో పేలుడు పదార్థాలు నింపి.. వాటిని వారి మెడలో వేసి పేల్చేశారు. నాలుగో జర్నలిస్టును పదునైన కత్తితో గొంతు కోసి మట్టుబెట్టారు. 
 
ఐసిస్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తమ గుట్టును బయటపెట్టారన్నా అక్కసుతో... ఫండ్స్ అందుకుంటున్నారన్న ఆరోపణలతో చేత జర్నలిస్టులను హతమార్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.