మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (11:55 IST)

ఐసిస్‌లో చేరిన గర్ల్స్‌ను రాళ్లతో కొట్టి దారుణంగా చంపేసిన టెర్రిరిస్టులు..!

గత ఏడాది ముస్లిం అమ్మాయిలను టెర్రరిజంవైపు ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ ఓ పోస్టర్‌ను తయారు చేసింది. వాటిలో ఆస్ట్రియా నుంచి సిరియాకు వెళ్లి ఫైటర్లుగా మారిన 17 ఏళ్ల సమ్రా కెసినోవిక్, 15 ఏళ్ల సబీనా సెలిమోవిక్‌లను టెర్రరిస్టులు రాళ్లతో కొట్టి చంపేశారు.

ఐఎస్ఐఎస్ అత్యంత బలంగా ఉన్న రక్కా నగరంలోని ఓ గృహంలో వీరిద్దరూ సుమారు ఏడాది పాటు ఉన్నారని.. ఇటీవల వీరు రక్కా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రాణాలు కోల్పోయారని పలు పత్రికలు ప్రచురించాయి. తప్పించుకునే క్రమంలో టెర్రరిస్టులు చేతికి వీరు పట్టుబడ్డారని తెలుస్తోంది.
 
2014లో ముస్లిం అమ్మాయిలను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ ఓ పోస్టర్ ను తయారు చేయగా, వాటిల్లో వీరి చిత్రాలనే ప్రచురించారు. ఆ తరువాత వీరి చేతుల్లో ఏకే-47 తుపాకులు ఉన్న చిత్రాలు, చుట్టూ జీహాదిస్టులు ఉన్న ఫోటోలు ఎన్నో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

అంతకుముందు వీరిద్దరూ 2014లో ఇంటి నుంచి పారిపోయారు.. అల్లా కోసం ప్రాణాలు అర్పిస్తామని.. తమను ఎవ్వరూ వెతకవద్దంటూ.. నోట్ రాసి మరీ వెళ్లారు. సిరియా ఐసిస్‌లో చేరారు.