శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (11:26 IST)

జపాన్‌లో భూకంపం... 30 మందికి గాయాలు

జపాన్ దేశంలోని నగానో నగరంలో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదు అయిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. 
 
భూకంప ధాటికి దాదాపు సుమారు ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. దీంతో 30 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 
 
అయితే సునామీ విపత్తు వచ్చే సూచనలు ఏమి లేవని స్పష్టం చేశారు. 
నగానో నగరానికి దాదాపు 10 మైళ్ల దూరంలో ఈ భూకంపం గత రాత్రి సంభవించిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.