శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (11:54 IST)

రంగు చూసి ముస్లిం అనుకుంటారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: శ్రీనివాస్ భార్య ప్రశ్న

అమెరికాలో కాల్పులతో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన భార్య సునయన తీవ్రస్థాయిలో మీడియా ముందు విరుచుకుపడింది. తన భర్త మృతి వృధా కాకూడదన్నారు. శ్రీన

అమెరికాలో కాల్పులతో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన భార్య సునయన తీవ్రస్థాయిలో మీడియా ముందు విరుచుకుపడింది. తన భర్త మృతి వృధా కాకూడదన్నారు. శ్రీనివాస్ హత్యపై అమెరికా సమాజం, అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో సునయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఆకారం చూసి.. ఆయన ఓ ముస్లిం అనుకుని దుండగుడు కాల్పులు జరిపాడని చెప్పారు. 
 
అసలు రంగు చూసి ఎలా ముస్లిం అనే నిర్ణయానికి వస్తారని ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యకు కారణమైన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ జాత్యహంకార దాడులతో ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. అమెరికాపై తన భర్త ఎంతో ప్రేమ చూపించారనీ.. నేవీ రంగానికి ఎంతే సేవ చేయాలనుకున్నారని సునయన వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆయన అధైర్యపడలేదని అన్నారు. 
 
ఇదిలా ఉంటే.. అమెరికా ఒలేత్ లోని ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్స్ రెస్టారెంటులో షూటింగ్ సంఘటనపై ఎఫ్‌బీఐ విచారణ మొదలుపెట్టింది. ఏవియేషన్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌పై జాతివిద్వేషంతోనే కాల్పులు జరిగాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. రెస్టారెంటులో ఉన్నవాళ్ళంతా టీవీలో వస్తున్న బాస్కెట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారని, నిందితుడు పూరింటన్ ఉన్నట్టుండి అసహనంతో గొడవకు దిగాడని సాక్షులు చెప్పారు. 
 
రెస్టారెంటుకు తరచూ వచ్చే గ్రిలిట్ .. పూరింటన్‌ను అడ్డుకున్నాడు. ‘ఇది ఫ్యామిలీ రెస్టారెంటు… ఇక్కడ ఇలాంటివి కుదరదు, వెళ్ళిపోవాలని సూచించాడని సాక్షులు చెప్పారు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న పూరింటన్ బయటకు వెళ్లి… కాస్సేపటికే తిరిగొచ్చి ‘గెటౌట్ ఆఫ్ మై కంట్రీ’  అంటూ కాల్పులు జరిపాడని సాక్షులు వెల్లడించారు.