శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (12:44 IST)

శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు దారుణహత్య..! స్నేహితుడే గొడ్డలితో నరికి..!

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోదరుడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. గొడ్డలితో నరికి హత్యకు పాల్పడిన ప్రియాంత సిరిసేన స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. 
 
కోర్టు అతనిని ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌కు తరలించింది. కాగా, చైనా పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఘటన గురించి తెలుసుకుని షాక్ కు గురయ్యారు.