గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:37 IST)

గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత!

గాజాలోని దెబ్బతిన్న సూళ్లకు పాక్ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేయూతనందించారు. 
 
గత కొన్ని రోజుల క్రితం ప్రపంచ బాలల నోబెల్ అవార్డుకు (వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)ఎంపికైన మలాలా.. ఆ బహుమతి ద్వారా వచ్చిన 50 వేల యూస్ డాలర్లను అక్కడి స్కూళ్లను పునరుద్ధరించేందుకు అందజేశారు. 
 
ఈ మధ్య కాలంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో గాజాలో స్కూళ్లు ఘోరంగా దెబ్బతినడంతో మలాలా తన బహుమతి మొత్తాన్ని విరాళంగా అందజేశారు.