శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (13:09 IST)

మోస్ట్ వాంటెండ్ హఫీజ్ నిజంగానే బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడా?

మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్ట్, పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ గురువారం పాక్‌లోని ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో రోడ్డుపక్కన బాంబును అమర్చబోతూ అనుకోకుండా అది పేలిపోవడంతో ముక్కచెక్కలై మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. 
 
పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు నాయకత్వం వహించినా హఫీజ్ ఆ తర్వాత ఐఎస్‌ఐఎస్ గ్రూప్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో హఫీజ్ మృతి పట్ల టెర్రరెస్టు వర్గాలు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. 
 
ప్రపంచంలో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుగా అమెరికా ముద్ర వేసిన హఫీజ్‌తోపాటు మరో ఇద్దరు అతని అనుచరులు బాంబు పేలుడు ఘటనలో మరణించారని పాకిస్థాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే ఆ చనిపోయిందీ హఫీజ్ అవునా, కాదా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని టెర్రరిస్ట్ వర్గాల సమాచారం.