#MissWorld2017 ప్రియాంక తర్వాత 17 ఏళ్లకు మిస్ వరల్డ్గా భారతదేశ యువతి(వీడియో)
బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని 17 ఏళ్ల తర్వాత దక్కించుకున్నది మన దేశానికి చెందిన మానుషి చిల్లర్. చైనాలో శనివారం నాడు జరిగిన ఉత్కఠభరితమైన ఫైనల్స్లో మన దేశంలోని హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల
బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని 17 ఏళ్ల తర్వాత దక్కించుకున్నది మన దేశానికి చెందిన మానుషి చిల్లర్. చైనాలో శనివారం నాడు జరిగిన ఉత్కఠభరితమైన ఫైనల్స్లో మన దేశంలోని హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీకి గాను మనదేశంలో ఆమె 29 మందితో పోటీపడి అగ్రస్థానాన నిలిచి మిస్ వరల్డ్ పోటీకి ఎంపికైంది.
ఇకపోతే చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మానుషి 108 మందితో పోటీని ఎదుర్కొని మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని కైవసం చేసుకుంది. కాగా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రియాంకా చోప్రా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లాండ్ యువతులు నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానుషికి సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మానుషి ఎంపికను ఈ వీడియోలో చూడండి.