శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (22:32 IST)

అంగారకుడిపై ధూళి తుఫాను... భూమికి పంపిన మామ్

ఈ నెల 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహ తాజా చిత్రాల్లో ధూళి తుఫానుకు సంబంధించినవి పంపించింది. ఉపగ్రహంలోని కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది మామ్. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్ కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీయగా ఇప్పుడు మామ్ పంపించిన ధూళి తుఫాన్ ఫోటోలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గత గురువారం నాడు అంగారకుడి గ్రహానికి సంబంధించి తొలి విడత ఫోటోలను మామ్ పంపించింది. 
 
అరుణ గ్రహం ఉత్తరార్ధ గోళంలో ఈ తుపాను ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కాగా అరుణ గ్రహం అంతా బంగారుమయం అనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే పనిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాగా జీవి బతికేందుకు అనువైన వాయువు మీథేన్ అన్న సంగతి తెలిసిన విషయమే.