శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (11:54 IST)

తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా హతం...!

పెషావర్‌లో అభంశుభం తెలియని 148 విద్యార్థులను కాల్చి చంపిన ఫజులుల్లాను పాక్ సైన్యం హతమార్చింది. పాక్ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో తాలిబన్ అగ్రనేత మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్ మీడియాలో శనివారం విస్తృతంగా కథనాలు వెల్లడయ్యాయి. 
 
పెషావర్లో ఇటీవల జరిగిన ఆర్మీ స్కూల్పై తీవ్రవాదుల దాడిలో 148 మంది మృతి చెందిన ఘటనకు ఫజులుల్లానే సూత్రధారిని పాక్ ప్రభుత్వం భావించింది. ఈ పెషావర్ ఘటన అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని స్వాత్ లోయని తాలిబన్ స్థావరాలపై పాక్ సైన్యం దాడులు చేసింది.
 
ఈ దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్‌లుల్లా గురించి తెలిసినా.. పట్టించుకోనట్టు ఉన్నా పాక్‌ పెద్దలు.. పెషావర్ దాడితో సైనిక దాడులు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫజ్‌లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం,.. డ్రోన్‌ దాడులతో మట్టుపెట్టినట్టు పాక్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.