శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 20 జులై 2014 (16:49 IST)

ఎంహెచ్17 విమాన మృతదేహాలు తీసుకెళ్లిన ఉక్రెయిన్ రెబెల్స్!

మలేసియా ఎంహెచ్17 విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రష్యా అనుకూల తిరుగుబాటుదారులు తీసుకెళ్లారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు ప్రమాదంలో మరణించిన 196 మంది మృతదేహాలను తిరుగుబాటు దారులు తీసుకెళ్లినట్లు ఆ దేశ అత్యవసర సేవల విభాగం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, మృతదేహాలను తిరుగుబాటుదారులు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు అంతుచిక్కడం లేదని ఆ శాఖ పేర్కొంది. విమాన ప్రమాదం తర్వాత మృత దేహాలను తిరుగుబాటుదారులు ట్రక్కుల్లో ఎక్కిస్తుండటాన్ని అసోసియేటెడ్ ప్రెస్ విలేకరులు కూడా చూసినట్లు సమాచారం. తిరుగుబాటుదారులు తీసుకెళ్లగా మిగిలిన మృతదేహాలను ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం స్వాధీనం చేసుకుంది.