కుమార్తెల పేరిట వీసాలు.. అమెరికా, మెక్సికోలకు మైనర్ల తరలింపు.. కవల కుమార్తెలను?
మైనర్ బాలికలను అక్రమంగా తరలించి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు మెక్సికో దేశాలకు మైనర్ బాలికలను అక్రమంగా మైనర్ బాలికలను తరలిస్తూ.. విక్రయిస్తున్నారనే సమా
మైనర్ బాలికలను అక్రమంగా తరలించి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు మెక్సికో దేశాలకు మైనర్ బాలికలను అక్రమంగా మైనర్ బాలికలను తరలిస్తూ.. విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ నేరం కింద పఠాన్ సాజిద్ఖాన్(40), అతని భార్య పర్వీన్(35), మరో వ్యక్తి అసద్ ఒమర్ (41)లను పోలీసులు అరెస్టు చేశారు.
సాజిద్, పర్వీన్లకు కవల కుమార్తెలున్నారు. మైనర్ బాలికలకు కూతుళ్ల పేరిట పాస్పోర్టులు తీసుకొని వారిని అమెరికా, మెక్సికోలకు తరలించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో విదేశాలకు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా గుట్టు రట్టు అయింది. గత సంవత్సర కాలంలో నిందితులు మూడు సార్లు అమెరికా, మెక్సికో దేశాలకు అమ్మాయిలను తరలించారని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.