శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (15:26 IST)

లండన్‌లో మోడీ ఎక్స్‌ప్రెస్: 13న ప్రధానికి వాంబ్లే స్టేడియంలో ఘనస్వాగతం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబరులో లండన్‌లో పర్యటించనున్నారు. మోడీ పర్యటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నామని.. ఈ క్రమంలో వచ్చేనెల 13న వాంబ్లే స్టేడియంలో మోడీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్ఆర్ఐల కమిటీ ప్రతినిధి మయూరి పార్మర్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే లండన్‌లో మోడీ ఎక్స్‌ప్రెస్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించినట్లు పార్మర్ చెప్పారు. 
 
ఇకపోతే.. మోడీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ఎన్‌ఆర్‌ఐలు మోడీ ఎక్స్‌ప్రెస్‌ పేరిట ప్రత్యేకంగా రూపొందించిన ఓ బస్‌ను లండన్‌లో నెలరోజులపాటు నడపనున్నారు. యూకే వెల్‌కమ్స్‌ మోదీ పేరిట ఓ కమిటీ ఏర్పాటై ఈ బస్సును రూపొందించింది. లిటిల్‌ ఇండియాగా పిలిచే వాంబ్లేలో మోడీ బస్సు బయలుదేరిందని పార్మర్ వెల్లడించారు.