శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (09:06 IST)

సెల్ఫీ మృతుల్లో భారత్ టాప్ : మృతులంతా 21 యేళ్ళలోపువారే...

యువత సెల్ఫీల్లో మునిగిపోయింది. దీంతో పలు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిలో భారత్‌కు చెందిన యువతే అధికంగా ఉన్నారు. సెల్ఫీలు దిగేవారు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు, సెల్ఫీలు దిగుతున్న సందర్భాల్లో ఏ కారణల వల్ల చనిపోయారు? అనే అంశంపై స్టాటిస్తా అనే సంస్థ అధ్యయనం చేసింది.
 
ఈ పరిశోధనలో ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచం మొత్తంలో చూస్తే సెల్ఫీల కారణంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య భారత్‌లోనే అధికంగా ఉందని వెల్లడించింది. 2012 నుంచి 2014 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మృతుల సంఖ్య 49. మృతులందరూ 21 సంవత్సరాలలోపు వారే. అందులో 36 మంది అబ్బాయిలు కాగా, 13 మంది అమ్మాయిలు ఉన్నారు.
 
ఈ సంస్థ వెల్లడించిన జాబితా మేరకు... భారత్ -19, రష్యా-7, అమెరికా-5, స్పెయిన్-4, ఫిలిప్పీన్స్-4, పోర్చుగల్-2, ఇండోనేషియా-2, దక్షిణాఫ్రికా-1, రొమేనియా-1, పాకిస్థాన్-1, మెక్సికో-1, ఇటలీ-1, చైనాలో ఒక్కరు మృతి చెందారు. కాగా, ఈ నలభై తొమ్మిది మందిలో చాలా ఎత్తులో నుంచి పడిపోయి, నీటిలో మునిగిపోయిన వారు కొందరైతే, కారు, రైలు, విమాన, తుపాకీ ప్రమాదాల్లోను, జంతువుల కారణంగాను ప్రాణాలు కోల్పోయిన వారు ఇంకొందరు ఉన్నట్టు తెలిపింది.