శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (11:10 IST)

అమెరికాను కొలంబస్ కంటే ముస్లింలే మొదట కనిపెట్టారు!

అమెరికాను కనుగొన్న అంశంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లిం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాను కొలంబస్ కంటే ముందు ముస్లిం నావికులే కనుగొన్నారని వ్యాఖ్యానించారు. 
 
ముస్లిం నావికులు 1178లో అమెరికా చేరుకున్నారని పేర్కొన్నారు. అమెరికాను కనుగొనే క్రమంలో తాను క్యూబాలోని ఓ కొండపై మసీదును చూసినట్టు కొలంబస్ డైరీలో రాసుకున్నాడని ఎర్డోగాన్ తెలిపారు. 
 
కాగా, కొలంబస్ అమెరికాను కనుగొన్నది 1492లో అని పెక్కుమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 1996లో ప్రచురితమైన ఓ వివాదాస్పద వ్యాసంలో యూసఫ్ ఎమ్రోహ్ అనే చరిత్రకారుడు, ముస్లింలే అమెరికాను కనుగొన్నారన్న దానికి కొలంబస్ డైరీయే సాక్ష్యమని ఆయన గుర్తు చేస్తున్నారు.