శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (09:39 IST)

ప్రజాసేవ కోసమే దేవుడు నన్ను ప్రాణాలతో మిగిల్చాడు... బాబా రాందేవ్!

ప్రజాసేవ చేసేందు కోసమే దేవుడు తనను ప్రాణాలతో మిగిల్చాడని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. భూకంపాలతో అతలాకుతలమైన ఖాట్మాండులో ఆయన మాట్లాడుతూ.. తాను మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి భూకంప బాధితులకు సహాయం చేస్తానన్నారు. అసలు ఈ సేవలో పాల్గొనేందుకోసమే దేవుడు తనను కాపాడినట్టు తెలిపారు. 
 
భూకంప బాధితులకు సహాయక చర్యలు చేపట్టానని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశానని బాబా రాందేవ్ తెలిపారు. కాగా, శనివారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆయన శిక్షణ ఇచ్చిన వేదిక కూలిపోయింది. అప్పటివరకు ఆయన వేదికపై ఉండి కిందికి దిగినట్టు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.