శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (10:14 IST)

ఆ దేశ ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దోషులు.. అమెరికా కోర్టు తీర్పు

ఆమె ఓ దేశానికి ప్రథమ మహిళగా ఉన్నారు. కానీ, ఆమె మేనల్లుళ్లు మాత్రం డ్రగ్ ముఠాలో సభ్యులుగా కొనసాగి... ఇపుడు దోషులుగా తేలారు. ఆ ప్రథమ పౌరురాలు ఎవరో కాదు.. వెనిజులా దేశ ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్. ఈ మేనల్

ఆమె ఓ దేశానికి ప్రథమ మహిళగా ఉన్నారు. కానీ, ఆమె మేనల్లుళ్లు మాత్రం డ్రగ్ ముఠాలో సభ్యులుగా కొనసాగి... ఇపుడు దోషులుగా తేలారు. ఆ ప్రథమ పౌరురాలు ఎవరో కాదు.. వెనిజులా దేశ ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్. ఈ మేనల్లుళ్ళు డ్రగ్ కేసులో దోషులుగా తేలారు. 
 
అమెరికాకు మత్తు పదార్థాల రవాణా ఆరోపణల్లో వారు నేరం చేసినట్లుగా కోర్టులు ధృవీకరించాయి. న్యూయార్క్‌లోని ఫెడరల్ జ్యూరీ ఈ కేసును విచారిస్తూ వెనెజులా ప్రథమ మహిళ మేనళ్లులు ఈఫ్రెయిన్ ఆంటానియో ఫ్లోర్స్ (29), ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ఫ్రైతాస్ (30)ని దోషులుగా పేర్కొంది.
 
వీరికి విధించే శిక్షలను వచ్చే యేడాది మార్చి 7న ఖరారు చేయనున్నారు. వీరిద్దరు వెనిజులా నుంచి దాదాపు 800 కేజీల కొకైన్‌ను హోండురాస్ నుంచి అమెరికాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ (డీఈఏ) హైతీలో అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించింది. ఈ కేసులో తీర్పు తాజాగా వెలువడగా, వీరిద్దరు దోషులుగా తేలారు.