గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:20 IST)

అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. అమెరికాలోని పనామాలోని ఓ హోటళ్లోని స్విమ్మింగ్ ఫూల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 
 
మృతుడు ప్రకాశం జిల్లాలోని కంబం మండలంలోని రావిపాడుకు చెందిన సిహెచ్ సాయికృష్ణగా గుర్తించారు. సాయికృష్ణ బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి. ఉన్నత చదువుల కోసం అతడు అమెరికాలోని హూస్టన్ యూనివర్సిటీలో చేరాడు.
 
కాగా, అతని కుటుంబసభ్యులు కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి మృతుడి అంకుల్, 
హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. విహార యాత్ర కోసం పనామా వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్కాన్సాలో ఉంటున్న తమ బంధువులు సాయికృష్ణ మృతి విషయాన్ని చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు.
 
అక్కడి పోలీసులు సాయికృష్ణ మృతదేహాన్ని స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటికి తీసినట్లు తెలిపారని చెప్పారు. అయితే ఘటన ఎలా జరిగిందనే విషయం మాత్రం తమకు తెలియరాలేదని చెప్పారు. కాగా, మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.