9/11 దాడి స్ఫూర్తితోనే లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్పై దాడి చేశాడట!
9/11 దాడి గురించి అన్టోల్డ్ స్టోరీ పేరిట ఉగ్రవాద సంస్థకు చెందిన పత్రిక అల్ మాస్రా వెల్లడించిన కథనం చదివిన ఒసామా బిన్ లాడెన్ అదే స్ఫూర్తితో ట్విన్ టవర్స్పై దాడికి పథక రచన చేశాడట. అయితే ఆ ఈజిప్టు ఫ్లైట్ ప్రమాదానికి కారణం మాత్రం ఇంజిన్ ఫెయిలవడం కాదని.. ఈజిప్టుకు చెందిన ఓ పైలట్ చేసిన నిర్వాకం వల్లే లాడెన్కు ఆ ఆలోచన తట్టిందట.
1999లో లాస్ఏంజెల్స్ నుంచి ఈజిప్టు రాజధాని కైరోకు ప్రయాణిస్తున్న ఓ విమానాన్ని నడుపుతున్న పైలెట్.. కావాలనే ఆ విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో ముంచేశాడు. ఈ ఘటనలో 217 మంది జలసమాధి అయ్యారు. ఆ విషయాన్ని ఓ పత్రికలో చదివిన లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్పై దాడికి ప్లాన్ చేశాడని తెలిసింది.
అయితే ఈ ఘటనను స్ఫూర్తిగా తీసుకున్న లాడెన్.. ఈ ప్లాన్ను షేక్ మహ్మద్కు వివరించాడట. లాడెన్ సూచనను పరిగణనలోనికి తీసుకున్న మహ్మద్ తొలుత 12 అమెరికన్ విమానాలతో దాడి చేయాలని భావించాడట. అయితే చివరకు నాలుగు విమానాలతోనే దాడి చేసి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించాడు.