గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 మే 2017 (09:30 IST)

ట్రైనీ పైలట్ చేతిలో 305 ప్రయాణికుల ప్రాణాలు... ఫ్లైట్‌లో గుర్రుపెట్టి నిద్రపోయిన పైలట్..

పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్..

పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్.. క్యాబిన్‌లో గుర్రుపెట్టి నిద్రపోయాడు. అలా ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత నెల 26న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఓ విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే పైలట్‌ కెప్టెన్‌ అమీర్‌ అక్తర్‌ హష్మీ.. తన బాధ్యతలను ట్రైనీ పైలట్‌ మహ్మద్‌ అసద్‌ అలీకి అప్పగించాడు. 
 
ఆ తర్వాత ఆయనగారు బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లి ఏకంగా రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఘటనపై పీఐఏ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు.