శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (20:03 IST)

జమ్మూకాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న ఆ పవర్‌ ప్రాజెక్టులు ఆపండి: పాకిస్థాన్

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ఆపేయాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్‌లోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేశాయి. జ

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ఆపేయాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్‌లోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేశాయి. జమ్మూకాశ్మీర్‌లోని కిషన్‌గంగా, రాట్లేలోని హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు జీలం, చీనాబ్‌ నదులపై నిర్మిస్తున్నారు. 
 
ఆ ప్రాజెక్టులు నిలిపేయాలని తీర్మానం చేసిన విదేశీ వ్యవహారాలు కమిటీ, జల, విద్యుత్‌ కమిటీలు సింధు నదీ జలాలపై ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు మధ్యవర్తి కోర్టును ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకును కోరాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ప్రపంచ బ్యాంకు ఎలాంటి జాప్యం లేకుండా ఈ విషయంపై స్పందించాలని అడిగాయి.
 
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తి న్యాయస్థానం ఏర్పాటు చేసే వివాదం పరిష్కారం అయ్యేవరకు భారత్‌ ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రపంచబ్యాంకు ఒప్పించాలని కమిటీలు ఇచ్చిన ఉమ్మడి తీర్మానంలో పేర్కొన్నాయి. భారత్‌ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌ అన్ని దారుల్లో చర్యలకు దిగుతుందని, ఒప్పందం ఉల్లంఘనకు ఒప్పుకోబోమని పాక్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్‌ చౌదరి వెల్లడించారు.