గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:43 IST)

అమ్మాయితో అక్రమ సంబంధం.. బాలుడి మర్మాంగం కోసేసి, కళ్లు పీకేసిన పాకిస్థాన్ తండ్రి

పాకిస్థాన్‌లో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు దారుణంగా ప్రవర్తించారు. 15 ఏళ్ల అబ్బాయి మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. బాలుడ

పాకిస్థాన్‌లో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు దారుణంగా ప్రవర్తించారు. 15 ఏళ్ల అబ్బాయి మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. బాలుడి కుటుంబ సభ్యులు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పాకిస్తాన్‌లో అధికార పార్టీ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌) నేత ఒకరు నిందితుడికి మద్దతుగా ఉన్నారని బాలుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు లాహోర్‌ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ హైదర్‌ అష్రఫ్‌ మాట్లాడుతూ.. ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. గత ఫిబ్రవరిలో స్థానికంగా తొమ్మిదో తరగత చదువుతున్న అబ్బాయిని అమ్మాయి తండ్రి తన అనుచరులతో కలిసి స్కూల్‌ నుంచి కిడ్నాప్‌ చేశాడు. తన కుమార్తెతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని అనుమానంతో అతని మర్మాంగాన్ని కోసేశాడు. కళ్లను పీకేసి పరారైనాడు. స్థానికులు అతనికి చికిత్స అందించిన వైద్యులు బాలుడి ప్రాణానికి ప్రమాదం లేకపోయినా చూపు కోల్పోయాడని తెలిపారు.