శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 నవంబరు 2014 (14:57 IST)

పాక్‌లో మిలిటెంట్ల బహిరంగ శిక్ష.. తలనరికి.. సాయంత్రం వరకు..?

పాకిస్థాన్ మిలిటెంట్ల దుశ్చర్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ఇన్నాళ్ళు చాటుగా దురాగతాలకు పాల్పడిన ఉగ్రవాదులు... సైన్యానికి సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో ఒక వ్యక్తిని అందరూ చూస్తుండగానే తల నరికి చంపేశారు.
 
ఖైబర్ జిల్లాలోని మేహర్బాన్ కలయ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో బహిరంగ శిక్ష విధించిన మిలిటెంట్లు సాయంత్రం వరకు మృతదేహాన్ని కదిలించవద్దని హుకుం జారీ చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ ప్రాంతం తెహ్రీక్-ఇ-తాలిబాన్ నియంత్రణలో ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.