శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (17:43 IST)

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు గాయత్రి మంత్రం ఆలపించిన పాక్ అమ్మాయి(Video)

గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్

గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్రి మంత్రం సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందే ప్రతిధ్వనించింది. 
 
కరాచీలో మార్చి 15న పాకిస్థాన్‌ దేశంలోని మైనారిటీలైన హిందువులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఇంకా ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన అలా ఆశీనులై సంబరాలను చూస్తూ వున్నారు. ఇంతలో నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని ఆలపించింది. ఈ మంత్రాన్ని ప్రధాని షరీఫ్ ఆసక్తిగా ఆలకించారు. ఆమె పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టి అభినందించారు. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...