శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (11:04 IST)

తాలిబన్ కమాండర్లకు విషమిచ్చి చంపేసిన భద్రతా దళాలు

పాకిస్థాన్ తాలిబన్ వర్గాలు పాక్ భద్రతా దళాలపై గుర్రుగా ఉన్నాయి. శాంతి చర్చల కోసం వెళ్లిన తాలిబన్ కమాండర్లను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన భద్రతా దళాలు విషమిచ్చి చంపాయని పాక్ తాలిబన్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన తెహ్రీక్ ఈ తాలిబన్ (టీటీపీ), 2009లో ఐదుగురు సభ్యులు శాంతి చర్చల నిమిత్తం పెషావర్ వెళ్లగా వారిని అరెస్ట్ చేశారని తాలిబన్ వర్గాలు తెలిపాయి. 
 
తాలిబన్ కమాండర్లను పాక్‌లోని వివిధ జైళ్లలో ఉంచి హింసించారని, మంగళవారం నాడు విషమిచ్చి చంపారని తాలిబన్ సంస్థ ఆరోపించింది. 2007 నుంచి 2009 వరకూ స్వాత్ లోయలో కఠిన షరియా చట్టాలను, బహిరంగ మరణశిక్షలను అమలుచేయించిన ముస్లిం ఖాన్, మహబూబ్ ఖాన్‌లు విషమిచ్చి చంపిన వారిలో ఉన్నారని తాలిబన్ తెలిపింది.