గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (11:41 IST)

శ్మశానవాటికను తలపిస్తున్న పెషావర్ సైనిక పాఠశాల!

తాలిబన్ తీవ్రవాదులు సృష్టించిన మారణహోమంతో పెషావర్‌ సైనిక పాఠశాల శ్మశానవాటికను తలపిస్తోంది. సైనిక స్కూలులో తాలిబన్ ముష్కరులు జరిపిన పాశవిక దాడి ఘటనను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన పిల్లలు కొందరు ఇంకా తేరుకోని స్థితిలోనే ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆ పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని నిర్ణయించారు. 
 
పిల్లలతో పాటు స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ సంఘటనకు సంబంధించిన భయాందోళనలు తొలగించేందుకు కౌన్సెలింగ్ ఇప్పించనున్నట్లు పాకిస్థాన్ భద్రతా అధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం పెషావర్, ఇస్లామాబాద్ నుంచి మానసిక వైద్యులతోపాటు ఆర్మీ వైద్య అధికారులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొందరు అధికారులతో కమిటీ వేయనున్నట్లు చెప్పారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు.