శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (08:29 IST)

చైనా చిలుక పలుకులు.. కూటములు వద్దు.. కలిసి పనిచేద్దాం...

భారత్‌, జపాన్‌ మధ్య పెరుగుతున్న సంబంధాలను చైనా ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో పలు అంశాలను ప్రస్తావించడమే కాకుండా, హితోక్తులు చెప్పినట్టుగా చిలుక పలుకులు పలుకుతోంది.

భారత్‌, జపాన్‌ మధ్య పెరుగుతున్న సంబంధాలను చైనా ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో పలు అంశాలను ప్రస్తావించడమే కాకుండా, హితోక్తులు చెప్పినట్టుగా చిలుక పలుకులు పలుకుతోంది.
 
ముఖ్యంగా భారత్, జపాన్‌లు మరింత దగ్గర కావడం, ఇరు దేశాల మధ్య 15 రకాల కీలక ఒప్పందాలు కుదరడం, జపాన్ తొలిసారి తన రక్షణ సామాగ్రిని మరో దేశా(భారత్)నికి విక్రయించాలని నిర్ణయించడం వంటివి జీర్ణించుకోలేక పోతోంది.
 
ఈ నేపథ్యంలో ముంబై - అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు శంకుస్థాపనకు వచ్చిన జపాన్‌ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 15 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హు చున్‌యింగ్‌ స్పందించారు. ఇరు దేశాల ఒప్పందాలు శాంతి, స్థిరత్వానికి సహాయకారిగా ఉంటాయని నమ్ముతున్నట్టు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఈ ప్రాంతంలోని దేశాలు కూటములు కట్టడం కన్నా భాగస్వామ్యం కోసం పనిచేస్తే బాగుంటుందని వక్కాణించింది. 
 
ముఖ్యంగా, జపాన్‌ భారత్‌కు విక్రయించాలని భావిస్తున్న నేల, నింగి, నీటిలో పనిచేసే యూఎస్‌-2 యుద్ధ విమానం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. అబే, మోడీ సమావేశం పూర్తి వివరాలు తెలిస్తేనే స్పందిస్తామన్నారు. జపాన్‌ రక్షణ సామగ్రిని ఓ దేశానికి విక్రయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం కొందరిని విస్మయపరిచింది.