గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (18:14 IST)

సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట: తాత మృతదేహంతో సెల్ఫీ.. జైలు ఖాయమా?

సోషల్ మీడియా పుణ్యమా అంటూ యువతకు సెల్ఫీల పిచ్చి ముదిరిపోయింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే సెల్ఫీలు మానవతా విలువల్ని పోగొట్టేలా ఉన్నాయి. ఇది కూడా అటువంటిదే. సౌదీ అరేబియాకు చెందిన ఓ నెట్ ప్రియుడు తన తాత మృతదేహం తీసిన సెల్ఫీ ఫోటోను నెట్‌లో పెట్టాడు. మృతి చెందిన తాతయ్య మృత దేహం వద్ద నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ, సెల్ఫీ తీసుకున్నాడు. ఈ జుగుప్సాకరమైన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
 
అయితే ఈ ఫోటోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. శుభాలకు, అశుభాలకు తేడా లేకుండా.. మానవతా విలువల్ని మంటగలిపేలా ఇలాంటి సెల్ఫీలు తీయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ సెల్ఫీ పక్కన 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అని ట్యాగ్ కూడా పెట్టాడు. ఈ ఘటనపై సౌదీ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అయ్యగారికి జైలు ఖాయమని వార్తలు వస్తున్నాయి.