గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (15:51 IST)

ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు రైళ్ల ఢీ: నలుగురి మృతి.. 40 మందికి గాయాలు!

ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు రైళ్లు ఢీ కొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన జపాన్‌లోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒకే ట్రాక్‌పై వెళుతున్న రెండు ప్యాసింజర్ రైళ్లు రోసెన్‌హామ్, హోజ్‌కిర్చిన్ స్టేషన్ల మధ్య ఢీకొన్నాయి. మునిచ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బవేరియా ప్రాంతంలోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ సంఘటనలో నలుగురు మృతిచెందగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలన్నీ తిరగబడ్డాయి. ఎక్కువమందికి గాయాలైనట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. రైలు బోగీల శిథిలాల కింద చిక్కున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.