గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 31 జులై 2016 (17:56 IST)

చైనా ఆస్పత్రి బెడ్ మీద యువతి మృతదేహం.. వీడిన ఆత్మ.. నిజమేనా..? మీరూ చూడండి..!

ఇటీవల సోషల్ మీడియాలో ఆత్మల గోల ఎక్కువైంది. మరణానికి తర్వాత దేహంలోని ఆత్మ.. శరీరాన్ని వీడిపోతుందని వినేవుంటాం. అలాంటి ఘటనే.. ప్రస్తుతం చైనాలో చోటుచేసుకుంది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా దెయ్యాలు, భూత

ఇటీవల సోషల్ మీడియాలో ఆత్మల గోల ఎక్కువైంది. మరణానికి తర్వాత దేహంలోని ఆత్మ.. శరీరాన్ని వీడిపోతుందని వినేవుంటాం. అలాంటి ఘటనే.. ప్రస్తుతం చైనాలో చోటుచేసుకుంది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా దెయ్యాలు, భూతాలున్నాయనే మూఢనమ్మకాలను నమ్మేవారు ఇంకా ఉన్నారు. వీరిలో చైనీయులు టాప్‌లో ఉన్నారు. చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో దెయ్యం ఉందంటూ ప్రచారం జరిగింది. 
 
ఆ దెయ్యం దృశ్యాలకు సంబంధించిన వీడియో ఆసుపత్రి సిబ్బంది యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఫేక్ వీడియోగా కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి యూట్యూబ్‌లో చాలానే ఉన్నాయని, దెయ్యాలనేవే లేవని కొందరు బలంగా వాదిస్తున్నారు. ఇక ఒక మహిళా పేషెంట్ శరీరంలో నుంచి ఆత్మ వెళ్లడం తాము వీడియోలో గమనించామని ఆస్పత్రి సిబ్బంది నొక్కి చెప్తోంది. ఈ వీడియోకు వ్యూవ్ సంఖ్య బాగానే పెరుగుతోంది.