విచారణకు హాజరుకావాల్సిందే... రాజపక్సేకు విచారణ కమిషన్ సమన్లు..!
శ్రీలంక మాజీ అధ్యక్షు మహీంద రాజపక్సేకు మరో షాక్ తగిలింది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఫలితాలు వెల్లడి కాకముందే అధ్యక్ష భవనం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు.
ఇంతలోనే మరో షాక్కు గురైయ్యాడు. అవినీతి ఆరోపణల విచారణ కమిషన్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదిన విచారణకు హాజరు కావాల్సిందే నంటూ ఆదేశించింది. కాగా రాజపక్సే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.