గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:49 IST)

టీచర్‌ను హత్య చేసిన విద్యార్థి... మరో నలుగురిపై దాడి..!

బార్సిలోనా నగరంలోని జోయన్ ఫ్యూస్టర్ సెకండరీ పాఠశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల విద్యార్థి బాణం లాంటి ఆయుధం (క్రాస్బ్రో) తో విల్లు ఎక్కుపెట్టి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోయింది. 
 
అనంతరం ఆ విద్యార్థి మరో నలుగురు విద్యార్థులపైకి సంధించాడు. దీంతో వారు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడిని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. 
 
అయితే విద్యార్థి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.