బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (09:16 IST)

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య భీకర కాల్పులు.. 49 మంది మృతి

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని ఓ ఆర్మీ స్థావరాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని ఓ ఆర్మీ స్థావరాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ అనుకూల దళాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మరణించిన వారిలో 17 మంది సైనికులు కాగా 32 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. 12 నగరాల్లో సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు వార్ జరిగింది. హామా, అలెప్పో ప్రాంతాల్లో ఐఎస్ ప్రభావాన్ని తగ్గించేందుకు సిరియా సైన్యం మల్లగుల్లాలు పడుతోంది.