మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (10:02 IST)

టెక్సాస్‌ చర్చిలో కాల్పులు.. 26 మంది మృత్యువాత

అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం టెక్సాస్ రాష్ట్రం సదర్‌ల

అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం టెక్సాస్ రాష్ట్రం సదర్‌ల్యాండ్ స్ప్రింగ్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో జరిగింది. ఈ కాల్పుల్లో 28 మంది చనిపోగా, మరో 25 మందికిపైగా గాయపడ్డారు. 
 
ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు చర్చిలో ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో వచ్చిన వారిని ఆర్మీ దుస్తుల్లో వచ్చిన దుండగుడు లక్ష్యంగా చేసుకుని ఆటోమేటెడ్ మెషీన్‌గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారు హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగులు తీశారు. 
 
ఈ క్రమంలో తూటాలు తగిలి సుమారు 26 మంది నేలకూలారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం కలచివేస్తోంది. ఈ ఘటనపై ఆసియా దేశాల పర్యటనలో ఉన్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. జపాన్ నుంచే తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని తెలిపారు.
 
కాగా, అమెరికాలో వరుస కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. సదర్ ల్యాండ్ స్ప్రింగ్ చర్చిలో దుండగుడి కాల్పులతో సెక్యూరిటీ హై అలర్ట్ అయింది. చర్చిలో గాయపడినవారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అమెరికా అంతటా భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.