శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:21 IST)

అమెరికాలో కాల్పుల కలకలం... 20 మంది మృత్యువాత

అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పులు జరిగాయి. టెక్సాస్​లోని ఎల్​పాసో నగరంలో ఉన్న సియలో విస్టా షాపింగ్​ మాల్​లో ఆగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాల్పుల శబ్దాలకు మాల్​లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సాయుధులు పెద్ద ఎత్తున విరుచుకుపడి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో స్థానికులు భయాందోళనతో పరుగెడుతున్న వీడియోను కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.