శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:00 IST)

విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు కంపెనీ ఈసీఓ దుర్మణం!

మాస్కో విమానాశ్రయంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు దిగ్గజ టోటల్ కంపెనీ సీఈఓ క్రిస్టోఫీ డి మార్గెరి దుర్మరణం పాలయ్యారు. ఈయనకు వయస్సు 63యేళ్లు. మాస్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ పోర్టు అధికార ప్రతినిధి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతరాత్రి మంచును తొలగించే యంత్రాన్ని ఢీకొట్టడంతో విమానం కూలిపోయింది. ముగ్గురు సిబ్బంది సహా ఓ ప్రయాణికుడు చనిపోయారు. మరణించిన ఆ వ్యక్తి టోటల్ సంస్థ అధిపతి మార్గెరి అని నిర్ధారిస్తున్నా అని ఆయన తన ప్రకటనలో పే్రకొన్నారు. కాగా,  సీఈవో మరణాన్ని టోటల్ కంపెనీ కూడా ధృవీకరించింది.