శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2017 (19:12 IST)

మాతో ఎలా పెట్టుకున్నా మీరే మునిగిపోతారు... ఇండియాకు చైనా వార్నింగ్?

చైనా మామూలుగా వార్నింగులు ఇవ్వడంలేదు. వార్నింగులు మీద వార్నింగులు ఇస్తోంది. సరిహద్దు సమస్య నేపధ్యంలో భారతదేశం, చైనా వస్తువులపై ఆంక్షలు విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. యుద్ధం చేయకుండా చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిషేధిస్తే ఆ దేశానికి తీవ్ర నష్టం కలుగ

చైనా మామూలుగా వార్నింగులు ఇవ్వడంలేదు. వార్నింగులు మీద వార్నింగులు ఇస్తోంది. సరిహద్దు సమస్య నేపధ్యంలో భారతదేశం, చైనా వస్తువులపై ఆంక్షలు విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. యుద్ధం చేయకుండా చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిషేధిస్తే ఆ దేశానికి తీవ్ర నష్టం కలుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చైనా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
చైనా ఉత్పత్తులను అడ్డుకుంటే నష్టపోయేది చైనా కాదు... భారతదేశమే అని తెలుపుతున్నాయి. చైనా ఉత్పత్తులను అడ్డుకుంటే భారతదేశంలో ఉపాధి అవకాశాలు భారీగా పడిపోతాయనీ, ఫలితంగా భారతదేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని పేర్కొంది. అంతేకాదు... భారతదేశంలో తయారవుతున్న వస్తువులతో చైనా వస్తువులను పోల్చి చూసినప్పుడు ధర, క్వాలిటీలో తేడా వుంటుందనీ, అందువల్ల ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడించింది. 
 
అన్నిటికీ మించి భారతదేశంలో ప్రస్తుతం చైనా పెడుతున్న పెట్టుబడులకు బ్రేక్ పడుతుందని, దీనివల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొంది. కాబట్టి యుద్ధం చేసినా, చైనా వస్తువులపై నిషేధం విధించినా మునిగేది భారతదేశమే కాని తాము కాదంటూ బెదిరింపు మాటలు మట్లాడుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో తేలాల్సి వుంది.